Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. మరో నిందితుడు అరెస్ట్, పోలీసుల అదుపులో ఏ-6 చందూ

సంచలనం రేపిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల పరంపరం కొనసాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి కిడ్నాప్ ఘటనలో ఏ-6గా ఉన్న చందూని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చందూని విచారిస్తున్నారు.

Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. మరో నిందితుడు అరెస్ట్, పోలీసుల అదుపులో ఏ-6 చందూ

Adibatla Kidnap Case : సంచలనం రేపిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల పరంపరం కొనసాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి కిడ్నాప్ ఘటనలో ఏ-6గా ఉన్న చందూని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చందూని విచారిస్తున్నారు.

చందూని పట్టుకున్న పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అందరినీ పట్టుకుంటామన్నారు. మరోవైపు ఈ కిడ్నాప్, దాడి కేసులో ప్రధాన నిందితుడు, మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నాడు. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు నవీన్ వాడిన కారును పోలీసులు శంషాబాద్ సమీపంలో గుర్తించిన సంగతి తెలిసిందే. ఇంకా నవీన్ రెడ్డిని మాత్రం పోలీసులు పట్టుకోలేదు. నవీన్ రెడ్డిని పట్టుకోవడంలో పోలీసులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని యువతి కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి ఓ సైకో, వాడిని ఎన్ కౌంటర్ చెయ్యాలి- వైశాలి డిమాండ్

మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసు సంచలనం రేపింది. 40మంది యువకులు మన్నెగూడలోని యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ వ్యవహారంలో వేగంగా స్పందించిన పోలీసులు యువతిని కాపాడారు.

తన కూతురు విషయంలో నవీన్ రెడ్డి సైకోలాగా వ్యవహరించాడని వైశాలి తండ్రి దామోదర్ రెడ్డి ఆరోపించారు. బొంగులూరులోని ఓ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో నవీన్ తో తన కూతురుకి పరిచయం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి తన కూతురును ప్రేమ పేరుతో నవీన్ వేధిస్తూనే ఉన్నాడని వాపోయారు. ఈ నెల 9న (శుక్రవారం) నవీన్ రెడ్డి.. 50 మందికి పైగా యువకులతో వచ్చి తన ఇంటిపై దాడి చేసి, తనను తన కుటుంబసభ్యులను కొట్టి, తన కూతురిని కిడ్నాప్ చేశాడని కన్నీటిపర్యంతం అయ్యారు.

Also Read..Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి నేరచరిత్రపై ఆరా, గతంలో రెండు కేసులు నమోదు

తన కూతురును సొంతం చేసుకోవాలని నవీన్ ఎన్నో నాటకాలు ఆడాడడని, ఆమెతో పెళ్లి జరిగిందనడం కూడా అందులో ఒకటని ఆయన చెప్పారు. పెళ్లి జరిగిందని చెబుతున్న రోజున ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని, ఆ రోజు పెళ్లి జరిగిందనడం డ్రామా అని వివరించారు. నవీన్ రెడ్డిని తన కూతురు పెళ్లి చేసుకోలేదని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలతో నవీన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ రెడ్డిపై కిడ్నాప్, మర్డర్ అటెంప్ట్ సహా పలు సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కింద కేసు పెడతామన్న పోలీసులు.. పాత కేసులను తిరిగి తోడుతున్నారు. నవీన్ నేరచరిత్ర గురించి తెలుసుకుంటున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.