KA Paul On Agnipath : దేశం మండిపోతోంది, కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది-కేఏ పాల్ ఫైర్
శాంతి భద్రతలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇంత పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే కేసీఆర్ శాంతిభద్రతలు కాపాడరా? అని ప్రశ్నించారు.

KA Paul On Agnipath : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న విధ్వంసకాండపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపైనా ఆయన సీరియస్ అయ్యారు. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ తో దేశం మండిపోతోందని కేఏ పాల్ అన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పోలీసుల కాల్పుల్లో ఒక యువకుడు మృతి చెందడం బాధాకరం అన్నారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వంపైనా పాల్ విరుచుకుపడ్డారు. శాంతి భద్రతలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇంత పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే కేసీఆర్ శాంతిభద్రతలు కాపాడరా? అని ప్రశ్నించారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
తెలంగాణ పోలీసులు, హోంమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. యువకులపై దాడి దురదృష్టకరం, బాధాకరం అని వాపోయారు. తెలంగాణలో శాంతిభద్రతలు లేవన్న కేఏ పాల్.. 30పైగా అత్యాచారాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం కావడానికి వారు చేసిన అవినీతే కారణం అన్నారు కేఏ పాల్. బీజేపీ వచ్చిన తర్వాత దేశం బాగుపడుతుందని అనుకుంటే, అంతకన్నా ఎక్కువగా పాడవుతోందని వాపోయారు.
Agnipath : ఆర్మీ జవాన్ కావాలని కలలుకన్న యువకుడు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి
సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో… ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు.
Agnipath : అప్పుడు అన్నదాతలతో.. ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్
ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగింది. ఈ యువకుడిని పోలీసులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా… అప్పటికే అతను మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఈ ఆందోళనల్లో 11 మంది యువకులు గాయపడ్డారు. వీరందరికీ గాంధీలో చికిత్స అందిస్తున్నారు.
- Alluri Statue: భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం
- KA Paul: ఎకనామిక్ సమ్మిట్ పెట్టండంటే మోదీ పెట్టడం లేదు.. 8లక్షల కోట్లు తెస్తా
- Chalasani Srinivas Rao: అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాజకీయం: చలసాని శ్రీనివాస రావు
- BJP: ప్రధాని వేదికపై కూర్చునే అతిథుల పేర్లు ఖరారు
- Parking Lot: బీజేపీ సభ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు
1Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
2Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
3Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ
4Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
5PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
6Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
7Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్
8Woman Suicide: మెట్రో రైలు కింద పడి మహిళ ఆత్మహత్య
9OnePlus Y1S Pro : వన్ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
10Britain Covid : రోజుకు 3లక్షల కరోనా కేసులు.. మళ్లీ కొవిడ్ సునామీ.. బ్రిటన్ను బెంబేలెత్తిస్తున్న మహమ్మారి
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!