అమీన్‌పూర్ బాలిక హై డ్రామా : సినిమాకు వెళ్లి అత్యాచారం జరిగిందని..

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 09:00 AM IST
అమీన్‌పూర్ బాలిక హై డ్రామా : సినిమాకు వెళ్లి అత్యాచారం జరిగిందని..

అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం జరగలేదని..ఆ బాలిక తప్పుడు సమచారం ఇచ్చిందని పోలీసులు నిర్ధారించారు.  అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఆత్యాచారం జరిగిందని వచ్చిన వార్తల్లో  నిజం లేదనీ..అది పూర్తిగా అవాస్తవం అని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. పది రోజుల క్రితం పరిచయమైన సందీప్(24) అనే వ్యక్తితో సదరు బాలిక బైక్‌పై సినిమాకి వెళ్లిందనీ.. తల్లిదండ్రులకు భయపడి అత్యాచారం జరిగిందని కథలు చెప్పి అందరినీ మోసం చేసిందనీ తప్పుడు కథనాలు అల్లి పోలీసులతో సహా అందరినీ తప్పుదోవ పట్టించిందని తెలిపారు. 

సందీప్ అనే వ్యక్తితో సినిమాకు వెళ్లి..ఆ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏం చేస్తారోనని భయపడిన ఆమె తల్లిదండ్రులకు  ఫోన్ చేసిన తనపై అత్యాచారం జరిగిందని చెప్పటంతో వారు భయపడిన తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సందీప్ పై పోక్సో చట్టంకింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  అనంతరం ఈ కేసుపై దర్యాప్తు చేపట్టగా సదరు బాలిక సందీప్ అనే వ్యక్తితో సినిమాకు వెళ్లి తల్లిదండ్రులు తిడతారని తనపై అత్యాచారం జరిగిందని డ్రామా ఆడిందని తేల్చారు. 

కాగా..సందీప్ తో సినిమాకు వెళ్లిన సదరు బాలిక తను ఎక్కడికి వెళ్లిందోనని అడుగుతారని…సందీప్ తో సినిమాకు వెళ్లిందని తెలిసి తిడతారని భయపడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనపై అత్యాచారం జరిగిందని ఫోన్ చేసింది. దీంతో ఇంటి యజమాని రవిగౌడ్ బాలికపై అత్యాచారం జరిగిందని కొన్ని వీడియోలోని సన్నివేశాలు… మైనర్ బాలిక అల్లిన స్టోరీ వీడియోను తీసి వైరల్ చేసిన ఇంటి యజమాని రవిగౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగానే అమ్మాయి చెప్పిన విషయాలను విచారించి కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.