Chief Justices: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు సిఫార్సు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు సంబంధించి కొత్త సీజేలను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

Chief Justices: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు సిఫార్సు

Ap Telangana

Chief Justices: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు సంబంధించి కొత్త సీజేలను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలను నియమించాలని రాష్ట్రపతికి సూచించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్‌ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు.

హిమ కోహ్లీ స్థానంలో సీజేగా జస్టిస్‌ ఎం.ఎస్‌ రామచంద్రరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ఉన్న సతీశ్‌చంద్ర శర్మను పూర్తిస్థాయి సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది.

ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఏకే గోస్వామిని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు బదిలీ చేసి గోస్వామి స్థానంలో ఛత్తీస్‌గఢ్‌ సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను నియమించాలని కొలీజియం సూచనలు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత వీరందరికీ పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించనున్నారు.