తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు..మరో ఇద్దరిలో వైరస్ లక్షణాలు

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 07:41 AM IST
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు..మరో ఇద్దరిలో వైరస్ లక్షణాలు

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మరో ఇద్దరిలో కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. అనుమానితుల శాంపిల్స్ ను అధికారులు పూణెకు పంపారు. కరోనా కొత్త కేసు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమవేశం నిర్వహించనున్నారు. స్కూళ్లు, థియేటర్లు, మాల్స్ మూసివేతపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర రాష్ట్రాలు తీసుకున్న చర్యలను పరిశీలిస్తున్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. 

కరోనాతో దేశంలో ఇద్దరు మాత్రమే చనిపోయారని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా 65 మంది కరోనా బాధితుల్లో 10 మందికి కరోనాను జయించారని తెలిపారు. హైదరాబాద్ లో మరో ఇద్దిరికి కరోనా లక్షణాలున్నాయని తెలిపసారు. పూర్తి రిపోర్టులు వచ్చాకే స్పష్టత వస్తుందన్నారు. కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు మూసివేశారని చెప్పారు.

హైదరాబాద్ లోని బాధితుడు కోలుకున్నాడని తెలిపారు. హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ ఒక కేసు నమోదైందన్నారు. హైదరాబాద్ లో ఇవాళ మరో కేసు పాజిటివ్ గా వచ్చిందన్నారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో రద్దీ పెరిగిందన్నారు.  

హైదరాబాద్ తోపాటు తెలంగాణ అంతటా జాగ్రత్తులు తీసుకున్నామని తెలిపారు. విదేశాల నుంచి వస్తున్నవారే ఈ వైరస్ ను తెస్తున్నారని…విదేశాల నుంచి ఎక్కడెక్కడికి వెళ్లి వస్తున్నారో తెలియదన్నారు. ప్రజలు భయపడతారని అన్ని వివరాలు తాము చెప్పటం లేదన్నారు. వారం రోజుల నుంచే తాము అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. 200 మంది ఆరోగ్య సిబ్బందిని ఎయిర్ పోర్టుతో ఉంచామని చెప్పారు. 

Also Read | వారి వివాహానికి గ్రామస్థులే పెళ్లి పెద్దలయ్యారు