Hyderabad : టెన్త్ విద్యార్థిపై కత్తులతో దాడి..
యువతి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. తన గర్ల్ఫ్రెండ్కు హాయ్ చెప్పాడని రగిలిపోయిన ఓ విద్యార్థి.. దుర్గాప్రసాద్పై దాడి చేయాలని ప్లాన్ వేశాడు.
Hyderabad : హైదరాబాద్ లంగర్హౌజ్లో కత్తిపోట్ల కలకలం చెలరేగింది. విద్యార్థులు కత్తులతో రెచ్చిపోయారు. ఇద్దరు కలిసి మరో విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దుర్గాప్రసాద్ అనే టెన్త్ క్లాస్ విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో దాడి చేసిన ఇద్దరు విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం దుర్గప్రసాద్ను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.
యువతి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. తన గర్ల్ఫ్రెండ్కు హాయ్ చెప్పాడని రగిలిపోయిన ఓ విద్యార్థి.. దుర్గాప్రసాద్పై దాడి చేయాలని ప్లాన్ వేశాడు. తన స్నేహితుడి సాయం కోరాడు.
Raging : తాడేపల్లిగూడెం ఎన్ఐటీలో ర్యాగింగ్.. జూనియర్ను చితకబాదిన సీనియర్లు
ఇద్దరూ కలిసి దుర్గాప్రసాద్కు మాయమాటలు చెప్పి.. మోటార్ సైకిల్పై రాజేంద్రనగర్ అత్తాపూర్లోని మూసీ వద్దకు తీసుకెళ్లారు. ఒక్కసారిగా దుర్గా ప్రసాద్పై కత్తులతో దాడి చేశారు. దాడి దృశ్యాలను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు.