Secunderabad: రైల్వే స్టేషన్ వద్ద “ఐ లవ్ సికింద్రాబాద్” ఏర్పాటు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్యూటిఫికేషన్ లో భాగంగా ఆ ఏరియాలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశారు. "ఐ లవ్ సికింద్రాబాద్" అనే సెల్ఫీ అరేంజ్ చేశారు. రోజూ 1.50లక్షల మంది పాసింజర్లు ప్రయాణించే దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫాం నెం.10 దగ్గర దీన్ని ఉంచారు.

Secunderabad: రైల్వే స్టేషన్ వద్ద “ఐ లవ్ సికింద్రాబాద్” ఏర్పాటు

Secunderabad

Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్యూటిఫికేషన్ లో భాగంగా ఆ ఏరియాలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశారు. “ఐ లవ్ సికింద్రాబాద్” అనే సెల్ఫీ అరేంజ్ చేశారు. రోజూ 1.50లక్షల మంది పాసింజర్లు ప్రయాణించే దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫాం నెం.10 దగ్గర దీన్ని ఉంచారు.

జంట నగరాలలో ప్రముఖ స్టేషన్‌గా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫ్యామస్ టూరిస్ట్ అట్రాక్షన్‌గా ఉంది. దేశవ్యాప్తంగా ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సెల్ఫీ పాయింట్ సెల్ఫీ లవర్లు, టూరిస్టులు, బ్లాగర్లు, ప్రయాణీకులకు వినోద కార్యకలాపంగా ఉపయోగపడుతుంది.

ఎక్కువగా ప్రయాణికులు సంచరించే ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఐకానిక్ టైపోగ్రాఫికల్ శిల్పం రాత్రిపూట ప్రకాశిస్తుంది.

Read Also: గన్‌తో సెల్ఫీ..

SCR జనరల్ మేనేజర్ (ఇన్‌ఛార్జ్), అరుణ్ కుమార్ జైన్, ఈ క్రియేటివ్ వర్క్‌కు సికింద్రాబాద్ డివిజన్ అధికారుల టీంకు అభినందనలు తెలియజేశారు.