Attack on Woman : దండుపాళ్యం తరహాలో.. తాగడానికి నీళ్లు అడిగి.. నోట్లో గుడ్డ కుక్కి..!

పట్టపగలు వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లింది గుర్తు తెలియని మహిళ.. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు నర్సాపూర్ బస్టాండ్ ఎదురుగ ఉన్న కాలనీలో రెడ్డిపల్లి పెంటమ్మ (65) ఒంటరిగా జీవిస్తుంది.

Attack on Woman : దండుపాళ్యం తరహాలో.. తాగడానికి నీళ్లు అడిగి.. నోట్లో గుడ్డ కుక్కి..!

Old Woman

Woman attack for gold: దండుపాళ్యం సినిమాలో సీన్ తరహాలో పట్టపగలే వృద్ధురాలిపై దాడిచేసి బంగారం ఎత్తుకెళ్లింది ఓ గుర్తుతెలియని మహిళ.. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు నర్సాపూర్ బస్టాండ్ ఎదురుగ ఉన్న కాలనీలో రెడ్డిపల్లి పెంటమ్మ (65) ఒంటరిగా జీవిస్తుంది.

మంగళవారం స్టీల్ సామాను అమ్మే మహిళ పెంటమ్మ ఇంటి వద్దకు వచ్చి కుక్కర్ తీసుకోవాలని ఒత్తిడి చేసింది.. అందుకు పెంటమ్మ నిరాకరించింది.. ఈ క్రమంలోనే తాగడానికి మంచి నీరు ఇవ్వాలని స్టీల్ సామాను అమ్మే మహిళ వృద్దురాలిని అడిగింది.

దీంతో ఆమె మంచినీరు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్ళింది. పెంటమ్మ వెనకే ఇంట్లోకి వెళ్లిన మహిళ ఆమె నోట్లో గుడ్డకుక్కి కర్రతో దాడి చేసింది. అనంతరం ఆమె మెడపై ఉన్న బంగారు గొలుసు. చేతులకు ఉన్న వెండి కడియాలు లాక్కొని పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత పెంటమ్మ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెంటమ్మకు బలమైన గాయం కావడంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన మహిళ ఆచూకీ కోసం సమీపంలోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు పోలీసులు.