విచిత్రం : దంతాలతో పుట్టిన శిశువు : వీరబ్రహ్మంగారి వింతేనంటున్న జనాలు

  • Published By: nagamani ,Published On : July 10, 2020 / 03:48 PM IST
విచిత్రం : దంతాలతో పుట్టిన శిశువు : వీరబ్రహ్మంగారి వింతేనంటున్న జనాలు

పుట్టిన పిల్లలకు దంతాలు రావాలంటే పది నుంచి పన్నెండు నెలల పడుతుంది. కానీ ఓ బిడ్డ మాత్రం పుట్టుకతోనే దంతాలతో పుట్టింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని సునీతా నర్శింగ్ హోంలో సుచరిత అనే గర్భిణికి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఆ బిడ్డ దంతాలతో పుట్టింది. పుట్టుకతోనే దంతాలతో పుట్టిన శిశువుని చూసి డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మి తెలిపారు. ఇటువంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయని సునీతా నర్శింగ్ హోం యజమాని డాక్టర్ విజయభాస్కర్ తోలిపారు. ఇది తెలిసినవారంతా శిశువు దంతాలతో పుట్టడంతో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వారి కాలజ్ఞానంలో చెప్పిన మరో వింత నిజమైందని భావిస్తునారు.

Read Here>>భద్రాద్రి కొత్తగూడెం : 23మంది జవాన్లకు కరోనా పాజిటివ్