KTR Vs Bandi Sanjay : చర్చకు రె‘ఢీ’..కేసీఆర్‌ను రాజీనామా పత్రం సిద్ధం చేసుకుని రమ్మను కేటీఆర్ : బండి సంజయ్

కేటీఆర్ విసిరిన సవాల్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో తేలాల్సిందేనని దానికి బీజేపీ చర్చకు సిద్ధంగా ఉందని అన్ని ఆధారాలతో నిరూపిస్తామని అప్పుడు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండమంటూ సవాల్ విసిరారు. చర్చకు వచ్చేటప్పుడు కేసీఆర్ రాజీనామా పత్రంతో రమ్మను కేటీఆర్ అంటూ కౌంటర్ ఇచ్చారు.

KTR Vs Bandi Sanjay : చర్చకు రె‘ఢీ’..కేసీఆర్‌ను రాజీనామా పత్రం సిద్ధం చేసుకుని రమ్మను కేటీఆర్ : బండి సంజయ్

KTR Vs Bandi Sanjay

KTR Vs Bandi Sanjay : కేటీఆర్ విసిరిన సవాల్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చిందో తేలాల్సిందేనని దానికి బీజేపీ చర్చకు సిద్ధంగా ఉందని అన్ని ఆధారాలతో నిరూపిస్తామని అప్పుడు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండమంటూ సవాల్ విసిరారు. చర్చకు వచ్చేటప్పుడు కేసీఆర్ రాజీనామా పత్రంతో రమ్మను కేటీఆర్ అంటూ కౌంటర్ ఇచ్చారు.

కాగా శుక్రవారం (జనవరి 6,2023)సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కేంద్రం తెలంగాణాకు ఇచ్చిన నిధుల విషయంలో విమర్శలు చేశారు. కేంద్రానికి తెలంగాణ రూ.3లక్షల 68వేల కోట్ల పన్నులు చెల్లించామని కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ. లక్షా 68వేల కోట్లు మాత్రమేనని కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం అబద్దాలు చెబుతున్నారని కిషన్ రెడ్డి చెప్పేవి అబద్దాలు అని తేలితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? నేను చెప్పేవి అబద్దాలు అని తేలితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను దీనికి మీరు (బీజేపీ) సిద్ధంగా ఉన్నారా? అంటూ సవాల్ విసిరారు.

కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగానే నిధులు ఇస్తోంది అంటూ మంత్రి కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మీరు చెప్పేది నిజమైతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను..నేను చెప్పేది నిజమని తేలితే మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి చెప్పేది అబద్ధమని తేలితే మీరు రాజీనామా చేయకపోయినా ఫరవాలేదు కానీ తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెబుతారా? అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ చేసిన ఈ సవాల్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.