Bandi Sanjay: నేను సచివాలయం కూలుస్తానని అనలేదు.. పునర్ నిర్మిస్తాం అంటున్నాం ..

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని వాళ్ళ పార్టీల నేతలే చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: నేను సచివాలయం కూలుస్తానని అనలేదు.. పునర్ నిర్మిస్తాం అంటున్నాం ..

Telangana BJP president Bandi Sanjay

Bandi Sanjay: కేసీఆర్ పట్టుమని రోజుకు నాలుగు గంటలు కూడా పనిచేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. ప్రగతి భవన్ గడీల నుంచి పేదల కష్టాలు కనిపించవని అన్నారు. సచివాలయం గతంలో బాగుండేదన్న సంజయ్.. నూతన సచివాలయంలో నల్ల పోచమ్మ గుడి కూడా కూల్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 600 కోట్ల‌తో నిర్మాణ పనులు ప్రారంభించిన సచివాలయం 1600 కోట్లకు పెంచి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు.

Bandi Sanjay : అక్కడ కచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, తెలంగాణ సచివాలయంలో మార్పులు చేస్తాం-బండి సంజయ్

నూతన సచివాలయం.. సచివాలయం మాదిరిగా కనిపించడం లేదని, ఓవైసీ చెప్పారని తాజ్ మహల్‌లాగా ఉందని చెప్పారని అన్నారు. ఓవైసీ కళ్ళలో ఆనందం కోసమే అలా కట్టారని బండి సంజయ్ విమర్శించారు. గతంలో నేను సచివాలయం కూలుస్తా అని అనలేదని, పునర్ నిర్మిస్త అంటున్నాం అని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. సచివాలయంలో కూల్చివేసిన నల్ల పోచమ్మ దేవాలయాన్ని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని వాళ్ళ పార్టీల నేతలే చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Bandi Sanjay : కేసీఆర్… నీ మాటలన్నీ కోతలే : బండి సంజయ్

దళిత బంధులో 30శాతం కమిషన్ తీసుకుంటున్నారని అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి బండి సంజయ్ ఆరోపణలు చేశారు. తెలంగాణ మొత్తం లంచాల మయంగా మారిందని విమర్శించారు. కేసీఆర్ నమ్మించి మోసంచేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. డ్రైనేజీ‌లో పాప పడి చనిపోయింది.. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెల కడుతుందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rajamouli : పాకిస్తాన్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రాజమౌళి సంచలన రిప్లై..

మన్ కీ బాత్ ప్రాధాన్యతను, గొప్పతనాన్ని బండి సంజయ్ వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని సంజయ్ తెలిపారు.