Bandi Sanjay: రాష్ట్రంలో పరిణామాలపై జాతీయ నాయకత్వానికి బండి సంజయ్ నివేదిక!

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ నాయకత్వానికి నివేదిక ఇచ్చారు బండి సంజయ్.

Bandi Sanjay: రాష్ట్రంలో పరిణామాలపై జాతీయ నాయకత్వానికి బండి సంజయ్ నివేదిక!

TG BJP

Bandi Sanjay: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ నాయకత్వానికి నివేదిక ఇచ్చారు బండి సంజయ్. డీకే అరుణ, జితేందర్ రెడ్డితో విడి విడిగా సమావేశమైన బండి సంజయ్.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

ఈ రోజు సాయంత్రం పార్టీ లీగల్ సెల్‌తో సమావేశం కానున్నారు బండి సంజయ్. రీ ఇన్విస్టిగేషన్ చేయడం, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై చర్చించనున్నారు బండి సంజయ్.

మహబూబ్ నగర్ బంద్‌కు పిలుపునిచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రి హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తుంది బీజేపీ. జితేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంద్రసేనా రెడ్డి, లీగల్ సెల్ నాయకుడు ఆంటోనీ, ప్రకాశ్ రెడ్డి సమావేశం అయ్యారు.

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి రాష్ట్ర వ్యహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను అరతీశారు తరుణ్ చుగ్. డీకే అరుణను, తనను ఇరికించే కుట్ర జరుగుతుందని వివారించారు.

బండి సంజయ్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. జితేందర్ రెడ్డి సైతం నడ్డాతో మాట్లాడారు.