Telangana : యూపీ తరహాలోనే బుల్డోజర్లతో వారి ఇళ్లు కూల్చేస్తాం : బండి సంజయ్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే లుచ్చాగాళ్ల అంతు చూస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేస్తే వారిపై బుల్డోజర్లతో దాడులు చేస్తామని అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం అని అన్నారు.

Telangana : యూపీ తరహాలోనే బుల్డోజర్లతో వారి ఇళ్లు కూల్చేస్తాం : బండి సంజయ్

Bandi Sanjay's Sensational Comments on BRS Govt

Telangana : తెలంగాణలో గెలుపే టార్గెట్ గా కృషి చేస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలపై అన్యాయాలు,అక్రమాలు,అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించిన బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే లుచ్చాగాళ్ల అంతు చూస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేస్తే వారిపై బుల్డోజర్లతో దాడులు చేస్తామని అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం అని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డ అంటే కేసీఆర్ బిడ్డేనా? నిధులు, పదవులు అన్నీ ఆమెకేనా? అంటూ ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ బిడ్డ అయినందుకు అన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు బండి సంజయ్.

బీఆర్ఎస్ నాయకులకు గూండాలతో పోల్చారు బండి. బీఆర్ఎస్ గూండాలు తెలంగాణలో మహిళలను కించపరుస్తుంటే సహించలా? విమర్శలు చేస్తున్న షర్మిలపై బీజేపీ గూండాలు కించపరుస్తు వ్యాఖ్యలు చేస్తున్నారని అటువంటివారి ఆగడాలను అడ్డుకుంటామని అన్నారు బండి.ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటమే పనిగా పెట్టుకున్న కేసీఆర్,కేటీఆర్ లకు కేంద్రాన్ని తిట్టటమే పనిగా పెట్టుకున్నారు అంటూ విమర్శించారు. హిందూ దేవుళ్లను కించేపర్చేలా వారిని తాట తీస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అత్యాచారాలకు పాల్పడేవారి తాట తీస్తాం అని ఆడబిడ్డలను కన్నెత్తి చూడటానికి కూడా భయపడేలా వారి పీచమణుస్తాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్న కూతుర్ని ఎలా బయటపడేయాలో తెలియక కేసీఆర్ ఆగమాగం అవుతున్నారంటూ ఎద్దేవా చేశారు బండి. అటువంటి నేతలున్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్అన్నారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ఉత్తరప్రదేశ్ లోని యోగీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లలతో కూల్చేస్తాం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలను కన్నెతి చూడాలంటే ఆకతాయిలు వణకేలా చేస్తామని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వ హాయాం నేరాల రేటు పెరిగిందని..తెలంగాణలో రోజుకో అత్యాచారం జరుగుతోందని బీఆర్ఆర్‌లో మహిళలకు గౌరవం‌ లేదన్నారు. లిక్కర్ దందా, డ్రగ్స్ దందా, పత్తాలాట అన్నీ కవితక్క.. తైతక్కవేనంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ఇదే ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు బండి సంజయ్.