పోలీసు శాఖ అప్రమత్తం.. ప్రాణనష్టం జరగకుండా చూడాలి : డీజేపీ
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖను డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
అందరు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మహేందర్ రెడ్డి కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
రానున్న రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుందనన అప్రమత్తతతో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.