Secunderabad : నిమిషాల్లో జబ్బు మాయం చేస్తానన్నాడు, కట్ చేస్తే ఘరానా మోసం

Secunderabad Fake Doctor : తాను లాడ్జిలో ఉన్నానని, అక్కడికి వస్తే మందులు ఇస్తానని చెప్పాడు. అతడిని గుడ్డిగా నమ్మేసిన బాధితురాలు అతడు చెప్పిన చోటుకి వెళ్లింది.

Secunderabad : నిమిషాల్లో జబ్బు మాయం చేస్తానన్నాడు, కట్ చేస్తే ఘరానా మోసం

Secunderabad Fake Doctor

Secunderabad Fake Doctor : నిమిషాల్లో జబ్బు మాయం చేస్తానని వృద్ధురాలిని నమ్మించాడు. కట్ చేస్తే.. ఘరానా మోసానికి పాల్పడ్డాడో వైద్యుడు.. కాదు కాదు నకిలీ వైద్యుడు. ఆ కేటుగాడి మాటలు నమ్మిన వృద్ధురాలు అడ్డంగా మోసపోయింది. వృద్ధురాలికి మత్తుమందు ఇచ్చి బంగారంతో ఉడాయించాడు కేటుగాడు.

సికింద్రాబాద్ గోపాలపురంలో జరిగిన ఈ ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి ప్రాంతానికి చెందిన మహిళకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నిందితుడు తాను నిమ్స్ లో సర్జన్ గా పని చేస్తున్నట్లు మహిళను నమ్మించాడు. దాంతో తన ఆరోగ్య సమస్యలు చెప్పుకుంది మహిళ. తన వద్దకి వస్తే జబ్బు త్వరగా నయం చేస్తానని అతడు నమ్మించాడు.

Rajasthan : చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి పిల్లలపై హెడ్‌మాస్టర్ అఘాయిత్యం, ఆ వీడియోలకు బానిసగా మారి ఇలా..

సికింద్రాబాద్ గోపాలపురం పరిధిలో తాను లాడ్జిలో ఉన్నానని, అక్కడికి వస్తే మందులు ఇస్తానని చెప్పాడు. అతడిని గుడ్డిగా నమ్మేసిన బాధితురాలు అతడు చెప్పిన చోటుకి వెళ్లింది. నిందితుడు ఇచ్చిన మాత్రలు వేసుకున్న తర్వాత ఆ మహిళ స్పృహ కోల్పోయింది. అంతే, అదే అదనుగా ఆమె నుంచి నిందితుడు బంగారాన్ని కాజేశాడు.

స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందో తెలుసుకుని బాధితురాలు షాక్ కి గురైంది. తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. లాడ్జిలో నకిలీ డాక్టర్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Also Read..Mumbai College girl : విద్యార్థినిని రేప్ చేసి హత్య..! కాలేజీ హాస్టల్లో దారుణం