Gaddar : ఆ పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగింది- గద్దర్ సంచలన వ్యాఖ్యలు

Gaddar : నిజాం ఉన్నప్పటి నుంచి భూమి సమస్య ఉందని గుర్తు చేశారు గద్దర్. ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసమే జరిగాయన్నారు.

Gaddar : ఆ పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగింది- గద్దర్ సంచలన వ్యాఖ్యలు

Gaddar

Gaddar – Dharani : ధరణి అనే పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కుట్ర జరిగిందని ప్రజా గాయకుడు గద్దర్ సంచలన ఆరోపణలు చేశారు. పంట పెట్టుబడి సాయం పేరుతో బీడు భూములుగా మార్చారని, బీడు భూములను కార్పొరేట్ కు ధారాదత్తం చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అలైన్ మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ దగ్గర రెండు రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా తొలి రోజు దీక్షలో గద్దర్ పాల్గొన్నారు. రైతులకు తన మద్దతు తెలిపిన గద్దర్.. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

భూమి సమస్య తెలంగాణ సమస్య అని ఆయన అన్నారు. నిజాం ఉన్నప్పటి నుంచి భూమి సమస్య ఉందని గుర్తు చేశారు గద్దర్. ధరణి అనే పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని గద్దర్ ఆరోపించారు. ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసం జరిగాయన్నారు.

Also Read..MP Asaduddin Owaisi: మేముంటేనే ఎవరైనా ముఖ్యమంత్రి కాగలరు.. గుర్తుంచుకోండి .. అందుకే అమిత్ షాకు నేనంటే భయం

తెలంగాణలో గత పదేళ్ల కాలంలో రైతులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని గద్దర్ వాపోయారు. భువనగిరి సభ తర్వాతే తెలంగాణ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం మొదలైందని గుర్తు చేశారాయన. ఓటు అనే ఆయుధంతో పోరాడండి. విప్లవాన్ని తీసుకురండి అని పిలుపునిచ్చారు గద్దర్.

పార్లమెంటులో రైతు వ్యతిరేక చట్టాలు చేస్తే పంజాబ్ రైతులు పోరాటాలు చేసి మరీ చట్టాలను రద్దు చేయించారని గుర్తు చేశారు గద్దర్. అదే రీతిలో తెలంగాణలో పోరాటం చేసి భూసేకరణ జీవోను రద్దు చేయిద్దాం అన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు గద్దర్.

Also Read..Uppal Constituency: ఒకసారి గెలిచిన వారు రెండోసారి ఎమ్మెల్యే కాలేదు.. బీఆర్‌ఎస్‌ లో రెండు వర్గాలు.. ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్