నీకు దమ్ముంటే సెక్యుల‌రిజం గురించి పాకిస్తాన్ లో మాట్లాడు : ఒవైసీకి సవాల్

బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 12:50 PM IST
నీకు దమ్ముంటే సెక్యుల‌రిజం గురించి పాకిస్తాన్ లో మాట్లాడు : ఒవైసీకి సవాల్

బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని

బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని ఒవైసీకి సవాల్ విసిరారు. మతం పేరుతో ముస్లింలను రెచ్చగొడుతున్నారని, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని ఒవైసీపై మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే టీఆర్ఎస్, ఎంఐఎం.. CAA, NRCని వ్యతిరేకిస్తున్నాయని సునీల్ చెప్పారు. కేసీఆర్ పాలనపైనా ఆయన విమర్శలు చేశారు. తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు.

ఆ దేశాల ముస్లింలను కచ్చితంగా పంపేస్తాం:
పౌరసత్వ చట్టం, పౌరసత్వ నమోదు విషయంలో వెనక్కి తగ్గేది లేదని సునీల్ దేవ్ ధర్ స్పష్టం చేశారు. దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లింలను కచ్చితంగా పంపేస్తామని తేల్చి చెప్పారు. దేశ ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇందులో ఎలాంటి మత కోణం లేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్ ఆర్సీలపై రాద్దాంతం చేస్తున్నాయని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని సునీల్ దేవ్ ధర్ ఆరోపించారు.

CAA తెచ్చింది కాంగ్రెస్సే:
మనందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, మనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామని లక్ష్మణ్ అన్నారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీఆర్ఎస్ చెప్పడం లేదన్నారు. సీఏఏపై కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ… దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. అక్కడి నుంచి వచ్చిన మైనారిటీల కోసం మోడీ ప్రభుత్వం సీఏఏ తెస్తే కాంగ్రెస్ విమర్శిస్తోందని ధ్వజమెత్తారు. సీఏఏ కాంగ్రెస్ హయాంలో చేసిందేనని… దాన్ని బీజేపీ ప్రభుత్వం సవరించిందని లక్ష్మణ్ చెప్పారు. మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా? అని కాంగ్రెస్ ను నిలదీశారు.

CAAతో మేలు జరుగుతుంది:
ప్రతిపక్షాలు సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో భయాందోళనలు కల్గిస్తున్నాయని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోని మైనారిటీలకు దీని వల్ల మేలు కలుగుతుందన్నారు. మోడీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

పాకిస్తాన్ లో నరకం చూస్తున్నారు:
దేశంలో గత ఆరేళ్ల నుంచి మంచి పనులు జరుగుతున్నాయని ఎంపీ అరవింద్ అన్నారు. స్వాతంత్ర్యం కంటే ముందు మన దేశం హిందూ రాష్ట్రమని చెప్పారు. ఆ తర్వాతే సెక్యులర్ అయిందన్నారు. కేసీఆర్ ముల్లా అయ్యారని.. కేటీఆర్ నాస్తికుడని విమర్శించారు. సీఏఏను 80 శాతంపైగా దేశ ప్రజలు సమర్థిస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ లో 23శాతం ఉన్న హిందూ జనాభా ప్రస్తుతం 3 శాతానికి పడిపోయిందని వాపోయారు. బంగ్లాదేశ్ లో 22 శాతం ఉన్న హిందువుల జనాభా 8 శాతానికి పడిపోయిందన్నారు. ఆ దేశాల్లో ఉన్న హిందువులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్.

పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌరసత్వ నమోదు(NRC)లపై శుక్రవారం(జనవరి 3,2020) బీజేపీ నిజామాబాద్ లో ప్రజా ప్రదర్శన సభ నిర్వహించింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్ ఇతరులు ఈ సభలో పాల్గొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Also Read : విశాఖ టూర్‌తో జగన్‌ మౌనం.. సీఎం మదిలో ఏముంది?