బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : సంచలన విషయాలు, బెంగళూరులో అఖిల ప్రియ భర్త ?

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు : సంచలన విషయాలు, బెంగళూరులో అఖిల ప్రియ భర్త ?

Kidnap

Akhil Priya’s husband in Bangalore? : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ్ రామ్ సోదరుడు చంద్ర హౌస్ కిడ్నాప్ నకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ కిడ్నాప్ నకు స్కెచ్ వేసినట్లు గుర్తించారు. 4 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. బెంగళూరు, చెన్నైలో తలదాచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గ్యాంగ్ లను కిరాయికి తీసుకుని చంద్రహౌస్ కిడ్నాప్ నకు పాల్పడినట్లు, 9 మంది ఇందులో పాల్గొన్నారని పోలీసులు నిర్ధారించారు.

సంచలన విషయాలు : –
హఫీజ్ పేటలో ఏవీ సుబ్బారెడ్డి, భూమా నాగిరెడ్డిలు భూములు కొనుగోలు చేసినట్లు, భూమా నాగిరెడ్డికి ప్రవీణ్ రావు తండ్రి కిషన్ రావు సన్నిహితుడు. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు కిషన్ రావు కీలకంగా వ్యవహరించారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత…ఏవీ సుబ్బారెడ్డి భూ వివాదంలోకి వచ్చారు. ఏవీ ఎస్టేట్స్ పేరిట ల్యాండ్ లోకి ప్రవేశించడంతో వివాదం తలెత్తింది. 2020 ఏవీ సుబ్బారెడ్డిపై కేపీ ఎస్టేట్స్ ఓనర్ ప్రవీణ్ రావు కేసు పెట్టారు. 50 ఎకరాల్లో చెరో 25 ఎకరాల భూమి చెందేట్లు మీడియేషన్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డితో గతంలోనే ప్రవీణ్ రావు సెటిల్ మెంట్ చేసుకున్నారు. 25 ఎకరాల భూమి తమకే కావాలని ప్రవీణ్ రావుపై భూమా ఫ్యామిలీ ఒత్తిడి చేశారు. పక్కా ప్లాన్ తో నే భూమా ఫ్యామిలీ కిడ్నాప్ నకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.