సందడి లేని Borabanda మళ్లీ శబ్దాలు, రాత్రంతా ఇళ్ల బయటే

  • Published By: madhu ,Published On : October 3, 2020 / 08:29 AM IST
సందడి లేని Borabanda మళ్లీ శబ్దాలు, రాత్రంతా ఇళ్ల బయటే

Borabanda లో భూమి నుంచి భారీ శబ్దాలు కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం రాత్రి శబ్దాలు ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో శబ్దాలు వచ్చాయని స్థానికులు వెల్లడిస్తున్నారు. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో రష్ గా ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం సెలెంట్ అయిపోయింది.



వీకర్స్ కాలనీ ప్రాంతంలో భారీ శబ్దాలు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. శుక్రవారం రాత్రి 8 గంటల 15 నిమిషాలకు సుమారు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు వచ్చాయంటూ ప్రజలు చెబుతున్నారు. సమాచారం అందుకున్న GHMC బృందాలు, పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు. భారీ శబ్ధాలు వస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. శబ్దాలు రావడం వెనుక ఉన్న కారణాలను అన్వేషిస్తున్నారు.



అర్థరాత్రి 11.24 నిమిషాలకు మరోసారి భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. బొరబండ సైట్‌-3, ఎఫ్‌సీఆర్‌ హిల్స్‌, జూబ్లీహిల్స్‌, రహమత్‌ నగర్‌ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక 1.4 తీవ్రతతో భూ కంపం వచ్చినట్లు ఎన్ జి ఆర్ ఐ గుర్తించినట్లు తెలుస్తోంది.



అయితే 2016, 2017 సంవత్సరాల్లోనూ ఇదే విధంగా భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అప్పుడు కూడా అక్టోబర్‌లోనే భూమి కంపించిందన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని జూబ్లీహిల్స్ సీఐ సత్తయ్య కోరారు. బోరబండలో వచ్చిన శబ్దాలపై శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నామని తెలిపారు.



విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ (GHMC) డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. నాలుగేళ్ల కిందట కూడా ఇలాంటి శబ్దాలే వచ్చాయని.. కానీ అది భూకంపం కాదన్నారు డిప్యూటీ మేయర్. రాళ్ల మధ్యలోంచి నీళ్లు వెళ్తున్న సమయంలో శబ్దాలు వచ్చినట్లు గతంలో శాస్త్రవేత్తలు నిర్ధారించారన్నారు. ప్రజలెవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన భరోసా ఇచ్చారు.