”మైహోం” ఆధ్వర్యంలో మేళ్లచెర్వు మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు పరిధిలోని మైహోమ్ పరిశ్రమ మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 12:53 PM IST
”మైహోం” ఆధ్వర్యంలో మేళ్లచెర్వు మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు పరిధిలోని మైహోమ్ పరిశ్రమ మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు పరిధిలోని మైహోమ్ పరిశ్రమ మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవకలశ స్నపనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు భాగంగా మార్చి 17న స్వామివారి కల్యాణ మహోత్సవం జరగనుంది. నేటి(మార్చి 14,2020) నుంచి ఈ నెల 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరగనున్నాయి.

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారం రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఆధ్యాత్మిక వాతావరణంలో మహా సిమెంట్స్ ప్రాంగణం పరిఢవిల్లనుంది.  మైహోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకులను తిలకించేందుకు పరిశ్రమలోని ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.