Car Accident: నార్సింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొట్టిన కారు 

నార్సింగ్ వద్ద వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.

Car Accident: నార్సింగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొట్టిన కారు 

Car Accident

Car Accident: హైదరాబాద్ శివారు నార్సింగ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. శంకర్ పల్లి నుంచి నార్సింగ్ వైపు వస్తున్న కారు నార్సింగ్ సమీపంలో రోడ్డు పక్కనే నిలిచిఉన్న టిప్పర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Rangareddy Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

కారు ప్రమాదానికి గురైన సమయంలో అందులో అక్కాచెల్లెళ్లు అర్షిత, అంకితతో పాటు వారి స్నేహితులు నితిన్, అమృత్, మరికొందరు ఉన్నారు. అక్కచెల్లెళ్లు, నితిన్ ప్రమాద స్థలంలోనే మరణించారు. అమృత్ , ఇతర క్షతగాత్రులను స్థానికులు 108 సహాయంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గం మధ్యలోనే అమృత్ మరణించాడు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మృతులను నిజాంపేట్ వాసులుగా గుర్తించారు.

Shah Rukh Khan : ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అధికారి.. షారుఖ్ ఖాన్ నుంచి లంచం తీసుకున్నాడు!

కారు ప్రమాదం సమయంలో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తుంది. కొందరు కారులోనే చిక్కుకుపోవటంతో స్థానికులు, పోలీసులు వారిని బయటకు తీసేందుకు తీవ్రప్రయత్నాలు చేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. వేగంగావచ్చి ఢీకొనడం వల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.