డిజిటల్ ఎడ్యుకేషన్.. ఇక ప్రతి క్లాసుకి ఓ చానల్, స్కూల్ పిల్లలకు 12 డీటీహెచ్ చానల్స్
కరోనా కారణంగా అంతా మారిపోయింది. పరిస్థితులు, వ్యవస్థల్లో ఊహించని మార్పు కనిపించనుంది. భౌతిక
కరోనా కారణంగా అంతా మారిపోయింది. పరిస్థితులు, వ్యవస్థల్లో ఊహించని మార్పు కనిపించనుంది. భౌతిక
కరోనా కారణంగా అంతా మారిపోయింది. పరిస్థితులు, వ్యవస్థల్లో ఊహించని మార్పు కనిపించనుంది. భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. కరోనాను కట్టడి చేసే జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో అన్ని రంగాల్లో గణనీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యా వ్యవస్థలోనూ అనూహ్య మార్పు కనిపించనుంది. ఆన్ లైన్ చదువులు రానున్నాయి. డిజిటల్ ఎడ్యుకేషన్ వైపు అడుగులు పడుతున్నాయి. కరోనా నుంచి పిల్లలను కాపాడుకుంటూనే వారి చదువులకు ఆటంకం కలగకుండా ఆన్ లైన్ ఎడ్యుకేషన్ వైపు కేంద్రం మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగా ‘ప్రధాని ఈ-విద్య’ అనే కొత్త కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారు. క్లాస్ రూముల్లో చానల్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేందుకు ‘ప్రధాన్ మంత్రి ఈ-విద్య’:
ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేందుకు ‘ప్రధాన్ మంత్రి ఈ-విద్య’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఒక్క తరగతికీ ఒక చానల్ను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా ఆమె ఆదివారం(మే 17,2020) చివరి విడుత కేటాయింపుల వివరాలను వెల్లడించారు. లాక్డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ప్రజారోగ్య రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.
ఆన్లైన్ కోర్సులకు 100 వర్సిటీలకు అనుమతి:
ఇంటర్నెట్ వసతి లేని విద్యార్థులకు చేరువయ్యేందుకు స్వయం ప్రభ డీటీహెచ్ చానెళ్ల ద్వారా విద్యాబోధన అందించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు చానళ్లతోపాటు పాఠశాల విద్య కోసం అదనంగా మరో 12 చానళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విషయమై ప్రైవేట్ డీటీహెచ్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పారు. డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించేందుకు పీఎం ఈ-విద్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మే 30 నాటికల్లా ఆన్లైన్ కోర్సులను ప్రారంభించేందుకు టాప్ 100 యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్లో ఎలాంటి మహమ్మారులు ఎదురైనా:
ప్రజారోగ్య రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మల వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో హెల్త్, వెల్నెస్ సెంటర్లను త్వరితగతిన ఏర్పాటుచేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులు వచ్చినా భారత్ ఎదుర్కొనేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఇన్ఫెక్షన్ సంబంధింత ఆసుపత్రులు, అన్ని జిల్లాలు, బ్లాక్ స్థాయిలో సమీకృత ప్రజారోగ్య ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఐసీఎంఆర్ ద్వారా దేశంలో పరిశోధనలను ప్రోత్సహించనున్నట్లు, అలాగే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను అమలు చేయనున్నట్లు తెలిపారు.
అదనంగా 300 కోట్ల పనిదినాలు:
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించారు. లాక్డౌన్ కారణంగా వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న నేపథ్యంలో వారికి ఉపాధి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీని వల్ల సుమారు 300 కోట్ల పనిదినాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
* ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ.
* 2.2 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ.3,950 కోట్లు అందజేత.
* 20 కోట్ల జన్ధన్ ఖాతాల్లోకి రూ.10,025 కోట్లు బదిలీ.
* 6.81 కోట్ల మందికి ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.
* లాక్డౌన్ సమయంలో దాదాపు 12 లక్షల మంది ఈపీఎఫ్వో చందాదారులు రూ.3,360 కోట్ల మేర వెనక్కి తీసుకున్నారు.
Read Here>> నాలుగోసారి: లాక్డౌన్ పొడిగించిన కేంద్రం