CM KCR : ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్.. మూడు రోజులు అక్కడే..!

దేశ రాజధాని ఢిల్లీకి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.

CM KCR : ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్.. మూడు రోజులు అక్కడే..!

Cm Kcr Arrives Delhi Today

CM KCR Delhi Tour : దేశ రాజధాని ఢిల్లీకి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆదివారం (నవంబర్ 21) సాయంత్రం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అధికారులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కేసీఆర్ పర్యటించనున్నారు. యాసంగి వరిధాన్యం కొనుగోళ్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.

యాసంగి కొనుగోళ్లపై కేంద్రం నుంచి కేసీఆర్ స్పష్టత కోరనున్నారు. యాసంగి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే పలుసార్లు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కానీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మంత్రుల సమావేశంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ క్రమంలోనే కేంద్రంతో తేల్చుకునేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం స్పందన బట్టి యాంసంగి పంటలపై సీఎం ప్రకటన చేయనున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు ఫైండింగ్ అంశాలను కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, గజేంద్ర సింగ్ షేకావాత్ సహా పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. అలాగే కృష్ణా,గోదావరి జలాల వాటా,నూతన ట్రిబ్యునల్ ఏర్పాటుపై కూడా కేంద్రం నుంచి కేసీఆర్ స్పష్టత కోరనున్నారు.

Read Also : Somu Veerraju : ఏపీ రాజధాని ఒక్కటే.. అది అమరావతే.. బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు