ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌.. నేడు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష

ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌.. నేడు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష

CM KCR focus on Dharani e-portal issues : ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్‌ మరింత ఫోకస్‌ పెట్టారు. ధరణి ఈ-పోర్టల్‌లో భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా వచ్చే సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ధరణిపై ఇవాళ ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో.. ధరణి సమస్యలపై చర్చిస్తారని తెలుస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయంపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి కొద్ది మంది కలెక్టర్లు మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది.