CM KCR : రాంచీలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు.. పెరుగుతున్న ప్రజాదరణ

దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు ప్రజాదరణ పెరుగుతోంది. వారణాసిలో, రాంచీలో కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తుండడం..జాతీయ రాజకీయాల్లో...

CM KCR : రాంచీలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు.. పెరుగుతున్న ప్రజాదరణ

Cm Kcr

CM KCR Jharkhand Tour : సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుండి రాంచీకి బయలుదేరారు. కేసీఆర్‌కు స్వాగతం తెలుపుతూ రాంచీ అంతటా ఆయన ఫ్లెక్సీలు, భారీ కటౌట్‌లు ఏర్పాటయ్యాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌తో కేసీఆర్ భేటీ కానున్నారు. గాల్వాన్‌లో అమరులైన జవాన్ల కుటుంబాలకు జార్ఖండ్ సీఎంతో కలిసి 10 లక్షల చెక్కులను అందించనున్నారు కేసీఆర్. రాంచీలో గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి నివాళులు అర్పిస్తారు సీఎం. కేసీఆర్ జార్ఖండ్ పర్యటనతో పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు వేగం కానున్నాయి.

Read More : Telangana : జార్ఖండ్‌‌కు సీఎం కేసీఆర్

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై హేమంత్ సొరెన్‌తో చర్చించనున్నారు కేసీఆర్. ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసి జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది జెఎంఎం. ఇటీవలే కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాకరేను కలిశారు సీఎం. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్..నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు ప్రజాదరణ పెరుగుతోంది. వారణాసిలో, రాంచీలో కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తుండడం..జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జార్ఖండ్ పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.

Read More : Delhi : ఢిల్లీలో సీఎం కేసీఆర్ ని కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి..అందుకేనా..?

బీజేపీ వ్యతిరేక కూటమికి కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్న సమయంలో సుబ్రహ్మణ్యస్వామి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సొంత ప్రభుత్వ వైఖరిని ఇప్పటికే అనేకమార్లు సుబ్రహ్మణ్యస్వామి వ్యతిరేకించారు. ఆయన రాజ్యసభ పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈ తరుణంలో స్వామి, కేసీఆర్‌ను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక అన్ని రంగాల్లో పోటీ ఉన్నట్లే.. రాజకీయాల్లోనూ పోటీ ఉండాలన్నారు బీకేయూ నేత రాకేశ్‌ టికాయత్. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశంలోరాజకీయాలపై తాను చర్చించలేదన్నారు. అయితే పీపుల్స్‌ ఫ్రంట్‌ రావాల్సిన అవసరం ఉందన్నారు టికాయత్. దేశవ్యాప్తంగా వ్యవసాయ పాలసీ, రైతులకు కేసీఆర్‌ ప్రకటించిన ఆర్థిక సాయంపై చర్చించామన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన రైతుల వివరాలను మార్చి 10 తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు టికాయత్.