CM KCR: ఎన్టీఆర్‌లో నచ్చింది అదే.. ఎంతోమంది ఆకలి తీరింది -కేసీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని చెప్పారు కేసీఆర్. ఆ పథకం వల్లే ఎంతోమంది ఆకలి తీరిందని గుర్తుచేశారు కేసీఆర్. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగి, ఇప్పుడు మనం రూపాయికే కిలో బియ్యం ఇచ్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

CM KCR: ఎన్టీఆర్‌లో నచ్చింది అదే.. ఎంతోమంది ఆకలి తీరింది -కేసీఆర్

Kcr (1)

CM KCR: ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని చెప్పారు కేసీఆర్. ఆ పథకం వల్లే ఎంతోమంది ఆకలి తీరిందని గుర్తుచేశారు కేసీఆర్. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగి, ఇప్పుడు మనం రూపాయికే కిలో బియ్యం ఇచ్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని.. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని అన్నారు.

‘‘రైతు బంధుపై ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ.15 వేల కోట్లు అని, 95 శాతం మంది ఈ సాయం ఉపయోగపడుతోందని, ఎక్కడో ఒకరు మందు తాగడానికి ఈ డబ్బును వాడుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారని, రాష్ట్రంలో మొత్తం భూములు 2.5 కోట్ల ఎకరాలు ఉండగా.. రైతుల వద్దే కోటిన్నర ఎకరాలు ఉన్నాయని అన్నారు. రైతు కేంద్రంగా పనిచేసే ప్రభుత్వం మాదని, అవినీతిని అరికట్టేందుకు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు చెప్పారు.

సిద్ధిపేటలో కలెక్టరేట్, కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్.. తాను పుట్టిన జిల్లా సిద్ధిపేటేనని, తెలంగాణ రాకముందే మిషన్‌ కాకతీయ రూపకల్పన చేశామని అన్నారు. సిద్దిపేట, నల్లగొండ, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో ధరణి తయారు చేసేందుకు మూడేళ్లు పట్టిందని చెప్పారు కేసీఆర్. రెవెన్యూలో గందరగోళం ఎందుకని నేనే మీటింగ్ పెట్టి ధరణి రూపొందించామని అన్నారు.

ధరణి వల్ల ఇప్పుడు మూడు రకాలుగా మాత్రమే భూమి వేరే వాళ్ల పేరు మీదకు మారుతుందని అన్నారు. అమ్మడం లేదా కొనడం, వారసత్వం, గిఫ్టులాగా భూమి ఇవ్వడం వల్ల మాత్రమే భూమి మరొకరి పేరు మీదకి మారుతుందని కేసీఆర్ అన్నారు.