CM KCR in Yadadri: యాదాద్రికి కేసీఆర్.. ఏరియల్ వ్యూ తో అభివృద్ధి పనుల పరిశీలన ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు.

CM KCR in Yadadri: యాదాద్రికి కేసీఆర్.. ఏరియల్ వ్యూ తో అభివృద్ధి పనుల పరిశీలన ప్రారంభం

Cm Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి చేరుకున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా రాయగిరి చెరువు, టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్, రింగ్ రోడ్డు, గండి చెరువు, ఆలయ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయానికి వెళ్లి నేరుగా.. పనులను పర్యవేక్షిస్తారు.

దాదాపు 95 శాతం అభివృద్ధి పనులు పూర్తయిన నేపథ్యంలో.. ఆలయ పున: ప్రారంభ తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రకటించనున్నారు. ఆ సందర్భంలో నిర్వహించే ప్రత్యేక యజ్ఞయాగాదుల వివరాలను సైతం సాయంత్రం స్వయంగా మీడియాకు తెలియజేయనున్నారు.

ముఖ్యమంత్రి రాకతో.. యాదాద్రిలో ఉన్నతాధికారులు పోలీసు భద్రత పెంచారు. ఇప్పటికే ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి ఆలయ పున:ప్రారంభ తేదీని ఖరారు చేశారని.. ఆ మేరకే అభివృద్ధి పనుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన ఉండబోతోందని అధికార వర్గాలంటున్నాయి.