CM KCR: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్లో సమావేశం జరగనుంది.
CM KCR: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ(17 అక్టోబర్ 2021) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్లో ముఖ్యమైన సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఉమ్మడి సమావేశంలో పాల్గొననున్నారు కేసీఆర్.
పార్టీ సంస్థాగత నిర్మాణం, తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక, హెచ్ఐసీసీలో అక్టోబర్ 25వ తేదీన నిర్వహించనున్న ప్లీనరీ, అలాగే, వచ్చే నెల 15న వరంగల్లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
ప్రజాసమస్యలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్లీనరీలో చేయాల్సిన తీర్మానాలపై చర్చించనున్నారు టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై కూడా ఈ సమావేశంలో కేసీఆర్ ముఖ్యనాయకులతో చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 60లక్షల సభ్యత్వం ఉన్న పార్టీగా టీఆర్ఎస్ రికార్డు సృష్టించగా.. జిల్లాల్లో ఆఫీసులను ప్రారంభించి కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు చురుకుగా పనిచేసేలా దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.