CM KCR : యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు
యశోధ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. డాక్టర్ ఎం.వి.రావు నేతృత్వంలోని వైద్యబృందం ఆధ్వర్యంలోకి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గరుండి కేసీఆర్ కు వైద్య పరీక్షలను కేటీఆర్ చేయిస్తున్నారు.
CM KCR : యశోధ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. డాక్టర్ ఎం.వి.రావు నేతృత్వంలోని వైద్యబృందం ఆధ్వర్యంలోకి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దగ్గరుండి కేసీఆర్ కు వైద్య పరీక్షలను కేటీఆర్ చేయించారు.
వైద్య పరీక్షల అనంతరం ఫామ్ హౌస్ కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ కరోనావైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. సిటీ స్కాన్, వైద్య పరీక్షల కోసమే యశోద ఆస్పత్రికి కేసీఆర్ వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ రావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ అనంతరం కేసీఆర్ మొదటిసారి ఆస్పత్రికి వచ్చారు.
కేసీఆర్కు చెస్ట్ సిటీ స్కాన్, సి-రియాక్టివ్ ప్రొటిన్స్ (సీఆర్పీ), డీడైమర్, ఐఎల్-6, ఎల్ఎఫ్టీ, సీబీపీ, వైద్య పరీక్షలను వైద్యులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, యశోధ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు ముగిశాయి. ఫామ్ హౌస్కు కేసీఆర్ బయల్దేరారు. కేసీఆర్ కు 6 రకాల వైద్య పరీక్షలను వైద్యులు నిర్వహించారు.