TPCC Chief : సాయంత్రానికి తేలనున్న టీపీసీసీ చీఫ్ ?

టీపీసీసీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రానికి పీసీసీ అధ్యక్షుడి ప్రకటన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

TPCC Chief : సాయంత్రానికి తేలనున్న టీపీసీసీ చీఫ్ ?

Revanth Reddy

TPCC Chief : టీపీసీసీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సాయంత్రానికి పీసీసీ అధ్యక్షుడి ప్రకటన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైతే పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్లగలరో  వారి పేర్లు సీల్డ్ కవర్ లో హైకమాండ్ కు అప్పచెప్పారు.

రేవంత్ రెడ్డి సహా మరికొంత మంది పేర్లతో పార్టీ హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు. ఈ సాయంత్రం ఆరుగంటల లోపు ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఠాగూర్ నివేదికలోని అంశాలపై తెలంగాణ సీనియర్లు అభ్యంతరాలు చెబుతున్నారు. దీంతో అసంతృప్తులను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. వారిని సముదాయించి సాయంత్రంలోపు పీసీసీని ప్రకటించే అవకాశముంది.

మరో వైపు పంజాబ్ కాంగ్రెస్ రాజకీయ పరిణామాలు కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నదృష్ట్యా పంజాబ్ పార్టీలో ఉన్న అనిశ్చితిని ముందు తొలగిస్తారా… లేక తెలంగాణ పీసీసీ చీఫ్‌ను ప్రకటిస్తారో అని పార్టీ శ్రేణులు ఉత్కంఠంగా వేచి చూస్తున్నాయి.

మరోవైపు ఈనెల 24న సోనియా గాంధీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇంచార్జ్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆలోగా టీపీసీసీ చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.