డబ్బుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు

డబ్బుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు

Congress MLAs join TRS : డబ్బుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను వీడిన ఎమ్మెల్యేలను ఎప్పటికీ కాంగ్రెస్ లో చేర్చుకోబోమని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్, బీజేపీ బంధం ఢిల్లీలో దోస్తీ..గల్లీమే కుస్తీలాగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీబీఐ, ఐటీ దాడులు చేస్తారనే భయంతో బీజేపీతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు.

రెండేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి…రాహుల్ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.