మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రేవంత్‌ రెడ్డి సవాల్‌

మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రేవంత్‌ రెడ్డి సవాల్‌

Revanth Reddy angry on KTR : కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు, ఐటీఐఆర్‌, రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు రావాలని కేటీఆర్‌కు రేవంత్‌ సవాల్‌ విసిరారు. ఇద్దరం కలిసి ఢిల్లీలో దీక్షకు దిగుదామని చెప్పారు. మోడీని ఢీకొట్టే దమ్ముందా..? అని ప్రశ్నించారు.

కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి తరపున రేవంత్‌ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీతో కుమ్మక్కయ్యారని.. అందుకే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉన్నారని విమర్శించారు.