తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం…ఆ పార్టీలో చేరుతా : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Congress MLA Komatireddy Rajagopalreddy Will join BJP :  తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజల నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరే అవకాశాలు లేవని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. అన్నదమ్ములుగా కలిసి ఉంటామని రాజగోపాల్ పేర్కొన్నారు. తన సొంత అభిప్రాయం మేరకు పార్టీ మారుతున్నట్లు తెలిపారు.

మరోవైపు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో పాటు మొత్తం నాయకత్వంలోనే మార్పులకు ఢిల్లీలో అధిష్టానం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఛరిష్మాతో ఆర్థికంగా బలమైన నేతకు సారథ్య పగ్గాలు కట్టబెట్టి, సీనియర్లకు కీలక పదవులు కట్టబెట్టనుందట. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాడి వదిలేశారు. దీంతో నయా సారథి ఎంపిక అనివార్యమైంది.

దీంతో కెప్టెన్ స్థానంలో కొత్త కెప్టెన్ కోసం కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ఆశావహులతో చర్చిస్తూనే ఉన్నారు. పీసీసీ రేస్‌లో ఉన్న నేతలంతా హస్తినకేగి కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసి..తమకు ఛాన్స్ ఇస్తే స్టేట్‌ పార్టీని ఎంత బలోపేతం చేయగలమో పూస గుచ్చినట్లు వివరించారట.

దాదాపు ఆరేళ్ల తర్వాత పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న దశలో పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. పార్టీలో పీసీసీ చీఫ్‌ పోస్ట్‌ ఒక రకంగా పార్టీలో కాక రాజేసేంది. పాత, కొత్త గ్రూప్‌లుగా విడిపోయిన నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటూ వచ్చారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీహెచ్‌, మల్లు భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు నేతలు గట్టిగా యత్నించారు.

టీపీసీసీ నయా చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియమించేందుకే హైకమాండ్‌ ఇష్టపడుతోందట. రేవంత్‌ను నియమించాలని మెజార్టీ నేతలు ప్రతిపాదించారని, క్షేత్రస్థాయి నుంచి అధిష్టానం తెప్పించుకున్న నివేదిక సైతం రేవంత్‌కే అనుకూలంగా ఉండడంతో ఆయనకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న సీనియర్లు అసంతృప్తి చెందకుండా..పీసీసీలోనూ, రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ సమూల మార్పులు చేయాలని డిసైడైందట. పీసీసీ చీఫ్‌ పదవికోసం గట్టిగా ట్రై చేసి సోనియా, రాహుల్‌తో కూడా సమావేశమైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి ఆఫర్‌ చేసిందట.

ట్రెండింగ్ వార్తలు