Telangana : బీజేపీకి మూడవ సారి అధికారం ఇస్తే దేశం ముక్కలు అవ్వటం ఖాయం : వీహెచ్

బీజేపీకి మూడవ సారి అధికారం ఇస్తే దేశం ముక్కలు అవ్వటం ఖాయం అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు.

Telangana : బీజేపీకి మూడవ సారి అధికారం ఇస్తే దేశం ముక్కలు అవ్వటం ఖాయం : వీహెచ్

V. Hanumantrao Sharply Criticizes On The Bjp

Congress Bharat Jodo Yatra: భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపికి మూడవసారి అధికారం ఇస్తే భారతదేశం ముక్కలు కావటం ఖాయం అంటూ విమర్శించారు. దేశాలన్ని ముక్కలు చేయాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోందని అందుకే బీజేపీ నేతలు మతాల మధ్య విధ్వేషాలు కలిగించే వ్యాఖ్యలు చేస్తుంటారని మండిపడ్డారు. బీజేపీ నేతలు రోజుకో రకమైన వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇతర మతాలను కించపరచటమే బీజేపీ ఎజెండాగా ఉందని అన్నారు. మతాల మధ్య విద్వేషాలు కలిగించేవారిపై చర్యలు తీసుకోవాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు వీహెచ్.

దేశాన్ని ముక్కలు చేయటమే బీజేపీ ఎజెండా అని..కానీ కాంగ్రెస్ మాత్రం దేశాన్ని ఏకత్రాటిపై నడిపించే పార్టీ అని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ఓటు వేయాలని కోరారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర చేపడుతున్నాం అని వీహెచ్ తెలిపారు. దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది అని ముఖ్యంగా అత్యాచారలు పెరుగుతున్నాయని అన్న వీహెచ్చ అత్యాచారానికి పాల్పడినవారిని మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే దారుణాలు తగ్గుతాయని అన్నారు. కోర్టుకు వెళ్లిన అత్యాచారాల కేసుల్లో తీర్పులు త్వరితగతిన వెలువడాలని అన్నారు. అలా చేస్తే నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు.

కాగా..2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో వచ్చే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు ప్రణాళికలు వేశారు. దీంట్లో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలు కానుంది. భారత్ జోడో యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాహుల్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటి, టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్ తో పాటు భారత్ జోడో యాత్ర ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ కోసం ప్రత్యేక కమిటీలను ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ప్రకటించారు.

ఏఐసీసీ ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటిలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, అనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జితేందర్ సింగ్ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్ లో పి చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా,రణదీప్ సింగ్ సూర్జేవాలా, కే సునీల్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. భారత్ జోడో యాత్ర సెంట్రల్ ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ గ్రూప్ లో దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలెట్, శశి థరూర్, రణవీత్ సింగ్ భట్టు, కేజే జార్జ్, జోతి మని,ప్రద్యుత్ బోర్డోలూయి, జితూ పత్వారి, సలీమ్ అహ్మద్ ను అపాయింట్ చేసింది.