Karimnagar : ఈ తల్లి పరిస్థితి మరొకరికి రాకూడదు, కరోనా సోకిన సుశీల చనిపోయింది

: కరోనా... ఈ మహమ్మారి వచ్చి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంపేసింది.. అంతరాలను పెంచింది.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..

Karimnagar : ఈ తల్లి పరిస్థితి మరొకరికి రాకూడదు, కరోనా సోకిన సుశీల చనిపోయింది

Corona Infected Sushila Is Dies In Karimnagar

Sushila Is Died : రోనా… ఈ మహమ్మారి వచ్చి మనుషుల మధ్య ఉన్న బంధాలను తెంపేసింది.. అంతరాలను పెంచింది.. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది.. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఘటన చూశాక.. ఈ వ్యాఖ్యల్లో ఒక్క అక్షరం కూడా తప్పు లేదనిపిస్తోంది.. కరోనా ఫస్ట్‌ వేవ్‌ సమయంలో వైరస్‌ సోకిన వారిని అంటరాని వారిని చూసినట్టు చూసేవారు.. కానీ ఇప్పుడు కాలం మారింది.. వైరస్‌పై అవగాహన పెరిగింది.. కరోనా సోకితే అదేదో అనర్థాలు జరుగుతాయన్న భయాలు లేవు… కానీ..కొంతమంది మాత్రం ఇంకా..ఏదో జరిగిపోతుందన్నట్లు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఆదుకుని అండగా ఉండి.. గుండెధైర్యం చెప్పాల్సిన వాళ్లే.. అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారివల్లే.. జమ్మికుంటలో ప్రాణాలు కోల్పోయింది సుశీల.

జమ్మికుంటకు చెందిన 50 ఏళ్ల సుశీలకు కరోనా సోకింది.. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఇంటి యజమాని ఇంటి నుంచి గెంటేశాడు.. యజమాని చీత్కారంతో ఆమె బతుకు రోడ్డుపై పడింది.. పోనీ ఆమె ఎవరూ లేని ఆనాథ అంటే అదీ కాదు.. ఆమెకు ఇద్దరు కొడుకులు.. కనీసం వారు కూడా పట్టించుకోలేదు.. దీంతో ఇంతకాలం కూరగాయలు అమ్ముకున్న తోపుడు బండే దిక్కయ్యింది. ఓ వైపు విషమిస్తున్న ఆరోగ్యం.. మరోవైపు ఇంత మంది ఉన్నా అభాగ్యురాలిగా మిగిలిపోయానన్న మానసిక ఆవేదన.. దీంతో ఆమె మరింత కుంగిపోయింది.. సరైన తిండి లేక.. చికిత్స లేక.. రెండు రోజుల పాటు ఆ తోపుడు బండిపైనే ఉంది. అంతటితో ఆగలేదు ఆమె కష్టాలు. కోవిడ్ పేషెంట్‌ అని తెలియడంతో.. మార్కెట్‌ నుంచి గెంటేశారు స్థానికులు. చేసేదేం లేక.. ఓపిక లేకున్నా దగ్గర్లోనే ఉన్న ఫ్లైఓవర్ కిందకు తోసుకెళ్లి పడుకుంది.

ఆ తోపుడు బండిపైనే రెండు రోజుల పాటు ఉండిపోయింది.. కనీసం పట్టించుకున్న నాథుడే లేడు.. రోడ్డుమీద వెళ్లేవారు కూడా పాపమనలేదు.. ఆమె ఓ కరోనా బాధితురాలు అని తెలిసినా.. రెండు మందులు ఇచ్చి పంపారే తప్పా.. ఐసోలేషన్‌లో ఉంచలేదు వైద్యులు.. చివరికి రెండు రోజుల తర్వాత స్థానికులు దయతలచడంతో.. ఆమెను కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. కరోనా తీవ్రం కావడం.. సరైన ఆహారం లేకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుశీల మరణించింది.. బహుశా కరోనా కంటే కన్న కొడుకులు పట్టించుకోలేదన్న వేదన.. సమాజం చీత్కారాలే ఆమె ప్రాణం తీసి ఉంటాయి..

సుశీల మరణానికి కారణం ఎవరు? కన్నతల్లిని చూసుకోలేని కొడుకులదా? రెండు రోజులు రోడ్డుమీదున్నా పట్టించుకోని సమాజానిదా? ఐసోలేషన్‌ సెంటర్‌లో చేర్చుకోలేని వైద్య సిబ్బందిదా? కరోనా పేషెంట్లకు కష్టకాలంలో సాయం చేయకపోయినా ఫర్వాలేదు కానీ… వారిని వెలివేయవద్దు. చీదరింపులు, ఛీత్కారాలకు గురిచేయవద్దు. సాటి మనుషుల పట్ల కాస్త మానవత్వం చూపించగలిగితే అదే చాలు. రేపు ఎవరికైనా అదే పరిస్థితి ఎదురుకావొచ్చు. కాబట్టి కరోనా పేషెంట్ల పట్ల వివక్ష చూపకుండా.. ఆపదలో వారికి కాస్త అండగా నిలబడండి.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. పాజిటివ్ రోగి పక్కనే ఉన్నా.. ప్రాణాలమీదకు మాత్రం రాదు.. సుశీల పరిస్థితి మరెవరికీ రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

Read More : Jharkhand : తండ్రికి కరోనా పాజిటివ్, రక్షించాలంటూ కూతురు వేడుకోలు..పట్టించుకోని డాక్టర్లు..చివరకు