Corona RTC Depot : మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా సోకింది. నలుగురు సూపర్ వైజర్లు, ఏడుగురు కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Corona for 11 people in RTC Depot : తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, విఐపీల నుంచి ఫ్రంట్లైన్ వర్కర్స్ వరకు ఎవరినీ వదలడం లేదు. వరుసగా అందరికీ సోకుతోంది. మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా సోకింది. నలుగురు సూపర్ వైజర్లు, ఏడుగురు కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదిలావుండగా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో 32 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
మరోవైపు తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావు కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నట్లు వెల్లడించారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు కనపడి, పరీక్ష ద్వారా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ మరియు తగిన చికిత్స కోసం తాను ఆసుపత్రిలో చేరుతున్నాట్లు పేర్కొన్నారు.
Bhudan Pochampally : ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి
హైదరాబాద్ బీఆర్ఎకే భవన్లో ఐఏఎస్ అధికారులతో పాటు ఉద్యోగులకు వైరస్ సోకింది. సాధారణ పరిపాలన శాఖ, విద్యాశాఖల్లో 15 మందికి కోవిడ్తో బాధపడుతున్నారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్తో పాటు మరో ఐఏఎస్ అధికారి హోం ఐసోలేషన్లో ఉన్నారు. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాకు పాజిటివ్ నిర్ధారణ అయింది.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్, సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేస్తున్న 20మంది కోవిడ్ బారిన పడ్డారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ రాజస్తాన్ వెళ్లి వచ్చింది. వారిలో ఎస్ఐకి పాజిటివ్ నిర్ధారణ అయింది. అతని ద్వారా మిగిలిన వారికి కరోనా సోకింది.
Corona : మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో 32 మంది సిబ్బందికి కరోనా
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసు స్టేషన్లో కూడా 20మంది పోలీసులు కోవిడ్ బారినపడ్డారు. బాధితులంతా హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. పోలీసు స్టేషన్లోకి ఎవరినీ అనుమతించడంలేదు. ఫిర్యాదుల కోసం స్టేషన్ ముందు టెంట్ ఏర్పాటు చేశారు. మాస్క్ లేనివారి వెనక్కి పంపుతున్నారు. భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు.