Corona : బాలికల గురుకుల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా

ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం రేపింది. వైరా టీఎస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Corona : బాలికల గురుకుల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా

Corona (1)

girls’ gurukul school : ఖమ్మం జిల్లాలో కరోనా కలకలం రేపింది. వైరా టీఎస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలో రెండు రోజులుగా విద్యార్థినులు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు.

విషయాన్ని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్‌ కొంత మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. వెంటనే విద్యార్థులను ప్రత్యేక గదులకు తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

MLC Candidates : టీఆర్‌ఎస్‌ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

ప్రస్తుతం వైద్య సిబ్బంది గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందన్న సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై గురుకుల పాఠశాలకు చేరుకుంటున్నారు.

విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లలను చూసేందుకు పాఠశాలకు వెళ్లార. పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.