హైదరాబాద్ లో 24 గంటల్లో 79 కరోనా కేసులు…తెలంగాణలో 1275కి పెరిగిన సంఖ్య

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 04:59 PM IST
హైదరాబాద్ లో 24 గంటల్లో 79 కరోనా కేసులు…తెలంగాణలో 1275కి పెరిగిన సంఖ్య

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గినా జీహెచ్ ఎంసీ పరిధిలో వైరస్ విస్తరిస్తోంది. హైదరాబాద్ లో కరోనా బాధితులు పెరుగుతున్నారు. ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల్లో అత్యధికం జీహెచ్ ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. 

ఇవాళ గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 79 కేసులు వెలుగు చూస్తే మొత్తం జీహెచ్ ఎంసీ పరిధిలోనే కావడం ఇటు అధికారులు, అటు ప్రజలు కలవరం పెడుతోంది. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఒక్క జియాగూడలోనే 26 కేసులు నమోదు అయ్యాయి. 

తెలంగాణలో కరోనా కేసులు 1275కు పెరిగాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 444గా ఉన్నాయి. ఇవాళ 50 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 801 మంది డిశ్చార్జ్ అయ్యారు.

హైదరాబాద్ లో అధిక కేసులు నమోదు కావడానికి కాంటాక్ట్ కేసులు ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అధిక కేసులు నమోదు కావడంతో ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.