వెక్కి వెక్కి ఏడ్చిన మహిళా ఎంపీపీ

  • Published By: madhu ,Published On : November 4, 2020 / 02:04 PM IST
వెక్కి వెక్కి ఏడ్చిన మహిళా ఎంపీపీ

Cries MPP Shyamala : ఆమె ఓ ఎంపీపీ. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి. మండలంలో జరిగే ప్రతి విషయానికి బాధ్యత వహించాల్సిన హోదాలో ఉన్నారు. కానీ తన మాట ఎవరూ ఖాతరు చేయడం లేదంటున్నారామె. అధికార పార్టీకి చెందిన తనకే విలువ ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.



ములుగు జిల్లా వాజేడు మహిళ ఎంపీపీ శ్యామల. రైతు వేదికల నిర్మాణంలో నాణ్యతా లోపాలపై అధికారులను ప్రశ్నిస్తే.. నువ్వెవరు..? నీ వయసెంత అంటూ MPDO అవమానించారని వాపోయారు శ్యామల. అధికారిక కార్యక్రమాల గురించి తనకు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా ఎంపీడీవో అవహేళన చేస్తున్నారని ఆరోపించారు.



https://10tv.in/these-pictures-need-no-caption-crying-face-izmir-and-all-of-turkey-is-in-pain/
ఎంపీడీవో నిర్లక్ష్య వైఖరిని గతంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామని చెప్పారని.. తన ఆవేదనను ఎమ్మెల్సీ, జడ్పీ ఛైర్మన్, పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా… స్పందన లేదని విలపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన తన పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు, సొంత పార్టీ నాయకుల నుంచి అవమానాలు ఎదురవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.