Dundigal : భార్య 11 మందిని చంపితే…భర్త 8 మందిని హత్య చేశాడు

హైదరాబాద్‌లోని దుండిగల్‌లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అమాయకులను నమ్మించి.. అడవుల్లోకి తీసుకెళ్లి వారిని హత్య చేస్తున్న ఉదంతం బయటికి వచ్చింది..

Dundigal : భార్య 11 మందిని చంపితే…భర్త 8 మందిని హత్య చేశాడు

Murder

Criminal Couple : ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 19 మందిని చంపేశారు. కేవలం బంగారం మీద మోజుతో వీరందిరినీ కడతేర్చారు. కడతేర్చింది ఇక్కడ దంపతులు కావడం గమనార్హం. హత్యలు చేయడంలో ఒకరినొకరు పోటీ పడినట్లు అనిపిస్తోంది. బంగారం కోసం అమాయకలును నమ్మించి..అడవుల్లోకి తీసుకెళ్లి…హత్యలు చేస్తున్నారు. క్రూరమైన ఈ దంపతుల హత్యలకు పోలీసులు చెక్ పెట్టారు. ఓ మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read More : ఒలింపిక్స్‏లో భారత్ ఆధిపత్యం

హైదరాబాద్‌లోని దుండిగల్‌లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఓ మిస్సింగ్ ఫిర్యాదులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగారం కోసం అమాయకులను నమ్మించి.. అడవుల్లోకి తీసుకెళ్లి వారిని హత్య చేస్తున్న ఉదంతం బయటికి వచ్చింది.. ఈ దంపతులిద్దరు కలిసి 19 హత్యలు చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఈ హత్యల్లో భర్త 8 మందిని పొట్టన పెట్టుకోగా.. భార్య ఏకంగా 11 మందిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Read More : Airtel Prepaid Recharge : ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను పెంచుతూ ప్రకటన

ఒంటిపై బంగారం ఉంటే చాలు… వారితో మాట కలిపి.. కూలి పని ఇప్పిస్తామని నమ్మబలుకుతారు ఈ దంపతులు.. వారిని మాటలతో మాయచేసి సంగారెడ్డి, జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేయడం.. వారి నుంచి బంగారం దోపిడి చేసి పరారవుతున్నారు.. గుట్టుచప్పుడు కాకుండా హత్యలు చేస్తూ.. ఈ దంపతులిద్దరు సీరియల్‌ కిల్లర్స్‌గా మారారు. ఓ మిస్సింగ్‌ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. తీగ లాగితే డొంక కదిలిన తీరుగా ఈ దంపతులిద్దరి మర్డర్‌ హిస్టరీ బయటికి వచ్చింది.. దంపతులిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నారు.