Telangana Schools: ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ క్లాసులు.. టీవీ పాఠాలే!

కరోనా వైరస్ మహమ్మారి మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దివాళా తీసిన వ్యాపారాలు.. ఊడిన ఉద్యోగాలు.. దాచుకున్న సొమ్మంతా మందు గోళీల పాలు.. తమలో ఒకరిగా మెలిగిన ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళు.. ఎలా మహమ్మారి మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. కరోనా కేవలం పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా ఈ కరోనా వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి.

Telangana Schools: ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ క్లాసులు.. టీవీ పాఠాలే!

Telangana Schools

Telangana Schools: కరోనా వైరస్ మహమ్మారి మన జీవితాలను ఎంతలా ప్రభావితం చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దివాళా తీసిన వ్యాపారాలు.. ఊడిన ఉద్యోగాలు.. దాచుకున్న సొమ్మంతా మందు గోళీల పాలు.. తమలో ఒకరిగా మెలిగిన ఆత్మీయులను కోల్పోయిన వాళ్ళు.. ఎలా మహమ్మారి మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. కరోనా కేవలం పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా ఈ కరోనా వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు స్కూల్ కి వెళ్లక సంవత్సరం దాటింది.

కరోనా తొలి వేవ్ కాస్త తగ్గుముఖం పడ్డాక దేశవ్యాప్తంగా మళ్ళీ విద్యాసంస్థలు తెరుచుకుంటాయని ఊహించారు. కానీ, మళ్ళీ సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా వచ్చి పడింది. ఇప్పుడు సెకండ్ వేవ్ చివరి దశకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభించాలని భావించింది. కానీ థర్డ్ వేవ్ పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మరోసారి సమాలోచనలు చేసిన ప్రభుత్వం ప్రస్తుతానికి ఆన్ లైన్ క్లాసులు.. టీవీ పాఠాలకే మొగ్గుచూపింది.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీల్లో తరగతుల ప్రారంభాన్ని వాయిదా వేయాలని సర్కార్ నిర్ణయించింది. క్లాస్ రూం తరగతులు నిర్వహిస్తే హాస్టళ్లు కూడా తెరవాల్సిన పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. కేంద్రం పరిధిలోని సీబీఎస్ఈ, కేంద్రియ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో ప్రత్యక్ష తరగతులకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు. కేంద్రం మార్గదర్శకాలు విడుదలైతే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది.

సర్కార్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు ఆన్లైన్ తరగతులకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు సైతం ఇప్పట్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం అంత మంచిది కాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇంటర్ విద్యార్థులకు కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మూడు నుంచి పదో తరగతి వారికి మాత్రమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. దూరదర్శన్, టీశాట్ ద్వారా ముందుగా రికార్డు చేసిన తరగతులను ప్రసారం చేయనున్నారు.