E-Bikes : ఎలక్ట్రిక్ బైక్స్ పై లాక్ డౌన్ డ్యూటీ చేస్తున్న సైబరాబాద్ పోలీసులు

E-Bikes : ఎలక్ట్రిక్ బైక్స్ పై లాక్ డౌన్ డ్యూటీ చేస్తున్న సైబరాబాద్ పోలీసులు

E Bikes Hyd Police

police on lock-down duty on E-bikes : హదరాబాద్ లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ లాక్ డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు E-బైక్స్ పై చక్కర్లు కొడుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులకు పెట్రోలింగ్ నిర్వహించేందుకు E-బైక్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో సైబరాబాద్ పోలీసులు E-బైక్స్ పై చక్కర్లుకొడుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా లాక్ డౌన్ సమయంలో E-బైక్స్ పెట్రోలింగ్ విధానాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు, కానిస్టేబుల్స్ E-బైక్స్ పై చక్కర్లు కొడుతూ లాక్ డౌన్ డ్యూటీ చేస్తున్నారు. ఈ E-బైక్స్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం వెళుతుందని అధికారులు తెలిపారు. అలాగే నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని E-బైక్స్ విధానాన్ని ప్రారంభించామని తెలిపారు.