అమెరికా వెళ్తానన్న భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య.. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టిన కూతుళ్లు

ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు. తల్లిదండ్రుల పార్థివ దేహాలకు కుమార్తెలే తలకొరివి పెట్టారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ విషాద ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.

అమెరికా వెళ్తానన్న భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య.. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టిన కూతుళ్లు

daughters did parents funerals in khammam: అమెరికి వెళ్లే విషయంలో మనస్పర్థలతో భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కూతుళ్లే కొడుకులయ్యారు. తల్లిదండ్రుల పార్థివ దేహాలకు కుమార్తెలే తలకొరివి పెట్టారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ విషాద ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.

అమెరికాలో ఉండే చిన్న కూతురు దగ్గరికి వెళ్లే విషయంలో తలెత్తిన మనస్పర్థలతో తల్లాడ మండలం రంగంబంజర గ్రామానికి చెందిన సుబ్రమణ్యేశ్వరరావు మార్చి 3న భార్య సంక్రాంతి విజయలక్ష్మిని క్షణికావేశంలో కిరాతకంగా నరికి చంపేశాడు. ఆ తర్వాత మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఇద్దరి మృతదేహాలను మమత హాస్పిటల్‌లో బంధువులు భద్రపరిచారు.

చిన్న కుమార్తె సునీత శనివారం(మార్చి 6,2021) రాత్రి అమెరికా నుంచి గ్రామానికి చేరుకుంది. దీంతో ఐదో రోజైన ఆదివారం(మార్చి 7,2021) తల్లిదండ్రులకు కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న కుమార్తె సునీత తల్లికి తలకొరివి పెట్టగా… సుబ్రమణ్యేశ్వరరావు మృతదేహానికి పెద్దకుమార్తె సరిత అంత్యక్రియల క్రతువును పూర్తి చేశారు.

తల్లిదండ్రులకు కుమార్తెలిద్దరూ తలకొరివి పెట్టడం అందరినీ కలిచివేసింది. సుబ్రమణ్యేశ్వరరావు క్షణికావేశంలో చేసిన పనికి ఎంతో ఆనందంగా ఉండే ఆ కుటుంబం విషాదంలో మునిగిపోవడంతో పాటు ఇద్దరు కూతుళ్లకు తల్లిదండ్రులను దూరం చేసిందని స్థానికులు వాపోయారు.

సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు (65), విజయలక్ష్మి (60)లది 4 దశాబ్దాల అనుబంధం. జీవితం చాలా ఆనందంగా సాగిపోతోంది. ప్రస్తుతం వృద్దాప్యంలో ఒకరికొకరు తోడునీడగా ఉంటున్నారు. అలాంటి దంపతుల మధ్య అమెరికా చిచ్చు పెట్టింది. తన చిన్న కూతురిని చూసేందుకు అమెరికా వెళ్లాల్సిందేనని విజయలక్ష్మి పట్టుపట్టగా, ఇప్పుడే వద్దని భర్త చెప్పాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. తన మాట వినడం లేదని క్షణికావేశానికి లోనైన భర్త.. భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.