delhi high court: ఫలించిన తెలంగాణ దంపతుల పోరాటం.. కుమార్తెను కలిసేందుకు అనుమతి

ఢిల్లీలోని దొంగబాబా ఆశ్రమంపై తెలంగాణ దంపతులు జరిపిన పోరాటం ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది.

delhi high court: ఫలించిన తెలంగాణ దంపతుల పోరాటం.. కుమార్తెను కలిసేందుకు అనుమతి

Delhi High Court

delhi high court: ఢిల్లీలోని దొంగబాబా ఆశ్రమంపై తెలంగాణ దంపతులు జరిపిన పోరాటం ఫలించింది. ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమ బాధ్యతలను ఢిల్లీ హైకోర్టు కిరణ్ బేడీకి అప్పగించింది. మరోవైపు ఆ దంపతులు, ఆశ్రమంలో ఉన్న తమ కూతురును కలిసేందుకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మీనావతి, రాంరెడ్డి దంపతుల కూతురు సంతోష్ రూపా అమెరికాలో నానో టెక్నాలజీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. అనంతరం ఇండియా వచ్చిన తర్వాత ఢిల్లీలోని రోహిణి జిల్లాలో ఉన్న వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమంలో చేరింది. అప్పటినుంచి సంతోష్ రూపాను కలిసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు.

Delhi Covid : ఢిల్లీలో కరోనా భయం.. మళ్లీ నిబంధనలు

ఇందుకు ఆశ్రమ నిర్వాహకులు ఒప్పుకోలేదు. దీంతో తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమార్తెను కలిసేందుకు అనుమతించాలని, ఆశ్రమ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీరేంద్ర దీక్షిత్ తమ కుమార్తెను తప్పుదోవ పట్టించి, ఏడేళ్లుగా బంధీగా ఉంచుకున్నాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‌ఆశ్రమంపై చాలా ఏళ్ల నుంచి అనేక ఆరోపణలున్నాయి. ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్ర దీక్షిత్, తనను తాను మహాశివుడి అవతారంగా ప్రకటించుకున్నారు. ఆయన ఆశ్రమంలో 168 మంది మహిళల్ని బందీలుగా చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. మహిళల్ని ఇరుకైన గదుల్లో ఉంచి, వాళ్లకు మాదకద్రవ్యాలు అందిస్తూ మోసం చేస్తున్నారని కూడా ఆరోపణలొచ్చాయి. వీరేంద్ర దీక్షిత్‌పై అత్యాచార కేసులతోపాటు మరో పది కేసులు ఉన్నాయి. దీంతో 2017లో పోలీసులు ఆశ్రమంపై దాడి చేశారు. ఈ సమయంలో దొంగబాబా పారిపోయాడు. దీంతో వీరేంద్ర దీక్షిత్‌పై సీబీఐ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది. ఆచూకీ చెబితే ఐదు లక్షల రూపాయల నజరానా కూడా ప్రకటించింది. అయితే, అప్పటినుంచి వీరేంద్ర దీక్షిత్ పరారీలోనే ఉన్నాడు.

Telangana Jobs: తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

కాగా, మీనావతి-రాంరెడ్డి దంపతులు వేసిన పిటిషన్‌పై సీజే విపిన్ సాంగీ ధర్మాసనం విచారణ జరిపింది. ఆశ్రమ నిర్వాహకుడు పరారీలో ఉన్నప్పుడు ఆశ్రమాన్ని ప్రభుత్వానికి ఎందుకు అప్పగించకూడదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిందితుడిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని సీబీఐని ప్రశ్నించింది. ఆశ్రమ బాధ్యతల్ని కిరణ్ బేడీకి అప్పగించింది. ఆశ్రమంలోని మహిళల ఆరోగ్య, మానసిక, సంక్షేమ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక కమిటీ వేసింది. కిరణ్ బేడీ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో రోహిణి జిల్లా మెజిస్ట్రేట్, ఢిల్లీ మహిళా నేర విభాగం డీసీపీ, జిల్లా న్యాయ సేవల విభాగం కార్యదర్శిలను సభ్యులుగా నియమించింది. మరోవైపు ఆశ్రమంలో ఉన్న దంపతుల కుమార్తె సంతోష్ రూపాను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించింది.