Revanth Reddy: కేటీఆర్పై ఆరోపణలు చేయొద్దు.. రేవంత్ రెడ్డిని ఆదేశించిన కోర్టు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్ను ప్రస్తావిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Revanth reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్ను ప్రస్తావిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఇప్పటికే కేటీఆర్ రేవంత్రెడ్డిపై పరువునష్టం దావా వేశారు.
తప్పుడు ఆరోపణలను పరువునష్టం చర్యలుగా పరిగణించి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పేలా రేవంత్ రెడ్డిని ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టులో కేటీఆర్ పిటీషన్ వేశారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కోరారు కేటీఆర్. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను ట్విటర్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా రేవంత్ను ఆదేశించాలని పిటిషన్లో కోరారు కేటీఆర్.
ఈడీ డ్రగ్స్ కేసుతో ముడిపెడుతూ తన పరువు పోయేలా కానీ, తప్పుడు వ్యాఖ్యలు కానీ చేయకుండా రేవంత్ రెడ్డిని, అతని అనుచరులను నియంత్రించాలని పిటీషన్లో విజ్ఞప్తి చేశారు కేటీఆర్.