నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం : వైద్యులు అందుబాటులో లేక నిండు గర్భిణి మృతి
pregnant died in Government Hospital : మెదక్ జిల్లా నర్సాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు అందుబాటులో లేక ఓ నిండు గర్భిణి మృతి చెందింది. తిమ్మాపూర్కు చెందిన మహిళ డెలివరీ కోసం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో రెండు రోజులు ఆస్పత్రిలోనే పడిగాపులు కాశారు.
మహిళకు పురిటినొప్పులు రావడంతో వెంటనే సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీకి తరలించే క్రమంలో మార్గమధ్యలో మహిళ మృతి చెందింది. మహిళ మృతదేహన్ని నర్సాపూర్ ఆస్పత్రి తీసుకొచ్చి బంధువులు ఆందోళన నిర్వహించారు.
సరైన సమయంలో డాక్టర్ లేకపోవడంతోనే గర్భిణీ చనిపోయిందని ఆరోపించారు. గర్భిణీ మృతికి కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలన్నారు.