Secunderabad : భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి
సికింద్రాబాద్ తిరుమలగిరిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్య, అత్తను నరికి చంపాడు. అయితే కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Double murder in Thirumalagiri : సికింద్రాబాద్ తిరుమలగిరిలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. భార్య, అత్తను నరికి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం తిరుమలగిరిలో నివాసముంటున్న చిన్నబాబు, పుష్ప భార్యాభర్తలు.
తిరుమలగిరి మిలటరీ హాస్పిటల్లో పుష్ప పని చేస్తుండే వారు. అదే హాస్పిటల్లో చిన్న బాబు ఔట్సోర్సింగ్ ఎలక్ట్రీషన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్య పుష్పను, అత్తను చిన్నబాబు హత్య చేశాడు.
Banjara Hills : భర్తను చున్నీతో హత్య చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని
అయితే కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.