Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్
Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దోహా నుంచి జోహన్నెస్బర్గ్కు వస్తున్న ఇద్దరు మహిళా ప్యాసింజర్లు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నారు.
డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయడంతో దొరికిపోయారు. భారీ మొత్తంలో హెరాయిన్ పాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వాటి విలువ దాదాపు రూ.78కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు.
పట్టుబడిన నిందితుల నుంచి 12కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకుని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.