ED Petition : టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఈడీ
సోమేశ్కుమార్, సర్ఫరాజ్ అహ్మద్కు ఈనెల 13న న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్లు తెలిపింది. ఈ పిటిషన్పై త్వరలోనే విచారణ జరగనుంది.
Tollywood drugs case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కేసుకు సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వడం లేదంటూ సీఎస్ సోమేశ్ కుమార్, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్పై ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ కింద సోమేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ను శిక్షించడంతో పాటు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈడీ కోరింది.
సోమేశ్కుమార్, సర్ఫరాజ్ అహ్మద్కు ఈనెల 13న న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినట్లు తెలిపింది. ఈ పిటిషన్పై త్వరలోనే విచారణ జరగనుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ కోరిన వివరాలు ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.
Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. ఈడీకి కాల్ రికార్డింగ్స్ ఇవ్వని ఎక్సైజ్ శాఖ
అయితే హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఈడీ పేర్కొంది. వారిద్దరిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది.