TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ

జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఈడీ ఉంది. అలాగే, విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన వారిపై ఈడీ దృష్టి సారించింది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ

TSPSC Paper Leak (1)

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఈడీ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇక పేపర్ లీకేజీ కేసులో ఈసీఐఆర్ నమోదు చేసింది. జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఈడీ ఉంది. అలాగే, విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన వారిపై ఈడీ దృష్టి సారించింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ వివరాలు పబ్లిక్ డిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారు.

విదేశాల నుంచి పరీక్షలు రాశారని గతంలో ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో విదేశాల నుంచి బ్యాంక్ లావాదేవీలు జరిగాయి. ట్రాన్సాక్షన్స్ జరిగాయన్న ప్రధాన అభియోగాలున్న కేసులో ఈడీ రంగంలోకి దిగింది.  ఈ కేసులో మొత్తం అరెస్టైన 15 నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టులో రెండు లేదా మూడు రోజుల్లో ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. పేపర్ లీకేజీ కేసులో ఈడీ రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుంది? ఎలాంటి వివరాలు బయటికి వస్తాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ చైర్మన్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన సిట్.. పోలీసు కస్టడీకి మరో ముగ్గురు నిందితులు

ఈ కేసులో అరెస్టైన ఏ1 నిందితుడి నుంచి ఏ15 నిందితుడి వరకు విచారించాలని భావిస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాశారు. విదేశాల నుంచి ఆర్థిక లావాదేవీలు జరిగాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఫెమా నింబంధనల ఉల్లంఘన జరిగిందన్న ప్రధాన అభియోగాలతో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈకేసులో దర్యాప్తు కొనసాగిస్తన్న సిట్ అధికారులు నుంచి వివరాలు సేకరించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ ముమ్మర దర్యాపు చేస్తోంది.

టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది.  మూడు గంటలపాటు సిట్ అధికారులు జనార్ధన్ రెడ్డిని విచారించారు. విచారణ సమయంలో సిట్ అధికారులు జనార్ధర్ రెడ్డి స్టేట్ మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అరెస్టైన రాజేందర్, ప్రశాంత్, తిరుపతయ్యను మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకీ తీసుకుంటారు. ఏప్రిల్ 6వ వరకు కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు విచారణ చేయనున్నారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు.. ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ.10 లక్షల ఒప్పందం

సోమవారం 3.30 గంటలకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన సిట్ అధికారులు పేపర్ లీకేజీ వ్యవహారంలో 161 సీఆర్పీసీ కింద చైర్మన్ జనార్ధన్ రెడ్డిని మూడు గంటలపాటు విచారించి, అతని నుంచి వివరాలు సేకరించారు. టీఎస్పీఎస్సీ ప్రధాని కార్యాలయం నుంచి పేపర్ లీక్ అయింది కాబట్టి టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న ఉద్యోగులను సిట్ అధికారులు సాక్షులుగా పొందుపరిచిన నేపథ్యంలో వారందరినీ విచారించారు. గతంలో టీఎస్పీఎస్సీ ఉద్యోగుల వాంగ్మూలాలను సేకరించి, స్టేట్ రికార్డు చేసుకుని వారిని సాక్షులుగా పరిగణించారు.

గతంలో రిమాండో రిపోర్టులో శంకర్ లక్ష్మీని సాక్షిగా పేర్కొంటూ సిట్ అధికారులు రిపోర్టును స్పష్టంగా పేర్కొన్నారు. అదే తరహాలో ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను సైతం సాక్షులను పరిగణించింది. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సైతం సాక్షిగా పేర్కొనే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. విడతల వారిగా వారందరినీ కస్టడీలోకి విచారించి, స్టేట్ మెంట్ రికార్డు చేశారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు

ఏప్రిల్ 11న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై హైకోర్టులో విచారణ ఉంది. పూర్తి నివేదిక సమర్పించాలని సీట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పూర్తి నివేదికను సిట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితుల స్టేట్ మెంట్లతోపాటు ఉద్యోగులు ఇచ్చిన స్టేట్ మెంట్, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి స్టేట్ మెంట్ ను ఏప్రిల్ 11న నివేదిక ద్వారా సిట్ అధికారులు హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.